Sunday, May 5, 2024
- Advertisement -

జాక్పాట్ కొట్టిన బన్నీ భామ

- Advertisement -

మెంటల్ మదిలో అనే సినిమా తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి, ఆ పిమ్మట చిత్రలహరి, ఇటీవలే విడుదల అయినా బ్రోచేవారెవరురా అనే సినిమాల లో కూడా హీరోయిన్ గా నటించిన నివేతా పేతురాజ్ ఇప్పుడు తెలుగు లో ఒక పెద్ద ప్రాజెక్ట్ అందుకందనే వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాలు పెద్దగా తనకి గుర్తింపు తేకపోయినా ఈ సినిమా మాత్రం తనకి దక్కింది అని వినికిడి.

మొన్న నే అల్లు అర్జున్ తో ఒక సినిమా ఒప్పుకున్నా ఈ భామ ఇప్పుడు వెంటనే ఇంకొక పెద్ద సినిమా ఒప్పుకుందట. త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా వస్తున్న ఈ సినిమా లో నివేత రెండో హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమా అవకాశం అందుకున్న వెంటనే తనకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు ఒక పెద్ద నిర్మాణ సంస్థ తమ సినిమా లో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం నివేత ని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా త్వరలో రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రానున్న ఒక చిత్రానికి కూడా నివేత హీరోయిన్ అని ఫిలిం నగర్ సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -