Sunday, April 28, 2024
- Advertisement -

ఎమోషన్ పోస్టు పెట్టిన ప్రభాస్

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ ప్రపంచాన్ని వీడి రోజులు గడస్తున్నా అభిమానులు మాత్రం ఆయన లేరన్న నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఏడాది అక్టోబర్ 29న పునీత్ గుండెపోటుతో మరణించాడు. ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్. ఈ చిత్ర టీజర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా పునీత్‌ను తలుచుకుంటూ ప్రభాస్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. జేమ్స్ రూపంలో ఒక మాస్టర్ పీస్ ను చూడబోతున్నాం.. పునీత్ ని అభిమానించే కోట్ల మందికి ఇది స్పెషల్ చిత్రంగా మిగిలిపోతుంది. వి మిస్ యూ పునీత్ ” అని రాసుకొచ్చాడు ప్రభాస్.. చేతన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌‌గా నటించింది. శ్రీకాంత్ విలన్‌‌గా నటించాడు.

ఈ సినిమాలో పునీత్ పాత్రకి ఆయన అన్నయ్య శివరాజ్‌‌కుమార్ కన్నడలో డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాని మార్చి 17న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -