- Advertisement -
రజినీకాంత్ తాజాగా నటించిన కాలా సినిమా ఆడియో వేడుక నిన్న(బుధవారం)రాత్రి చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో గ్రాండ్గా జరిగింది. సినిమా గురించి రజినీ మాట్లాడుతు కబాలి సినిమా తరువాత మంచి కథ కోసం చూస్తేంటే సంతోష్ ఈ కథతో నా దగ్గరకు వచ్చాడు. సినిమా చాలా బాగా వచ్చిందని , ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదని ,కాని అన్నీ అంశాలు ఉంటాయని రజినీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ముంబైలోని ధరవిలో ఉంటున్న ప్రజల గురించి సినిమా ఉంటుందని తెలుస్తుంది.రజినీతో ‘కబాలి’ చిత్రాన్ని తెరకెక్కించిన పా.రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. రజినీ అల్లుడు ధనుష్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.