Friday, May 3, 2024
- Advertisement -

రష్మిక ని చూసి స్ఫూర్తి పొందుతున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

వరుస పరాజయాల తో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ చతికిలపడిన నేపథ్యం లో త్వరలో విడుదల కానున్న సినిమా మన్మధుడు 2 అందరినీ ఎంతగానో అలరిస్తుంది అనే విషయం మీద ఆవిడ చాలా ఆశలు పెట్టుకుంది. అటు తెలుగు లో, మరియు హిందీ లో రాణిస్తూ, ఇంకా ఇతర భాషలో కూడా అవకాశాల కోసం చూస్తుంది రకుల్. రకుల్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో ఉంది కానీ స్టార్డం మాత్రం చాలా లేట్ గా సంపాదించుకుంది అనే విషయం వాస్తవం. అందుకే కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేయడానికి రకుల్ కి చాలా సంవత్సరాలే పట్టింది.

అయితే ఆసక్తికరం అంశం ఏంటి అంటే రకుల్ ఇప్పుడు మన్మధుడు 2 కి కోటిన్నర తీసుకుంటుందట. ఇందులో ఆసక్తి ఏముంది అనుకుంటే పప్పు లో కాలేసినట్టే. నిజానికి రకుల్ కి అంత మార్కెట్ లేదు కానీ కొత్తగా వచ్చిన రష్మిక మూడు సినిమాలకి కోటి డిమాండ్ చేస్తున్న నేపథ్యం లో స్టార్ హీరోయిన్ అయినా తను ఎక్కువ తీసుకోవడం లో తప్పేమి లేదు అని ఒక అభిప్రాయానికి వచ్చి ఈ భారీ మొత్తం ఈ సినిమా కి తీసుకుంటుందట. ఇకపై చేసే సినిమాల కి కూడా ఎక్కువగా నే డిమాండ్ చేసి భారీ మొత్తం మూట కట్టుకోవాలని చూస్తుంది రకుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -