Friday, April 26, 2024
- Advertisement -

తలుపులు తెరుచుకున్న ‘ధర్మస్థలి’..!

- Advertisement -

మెగాస్టార్​ చిరంజీవి, సూపర్​ సక్సెస్​ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్టర్​ అనగానే మెగా ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అయిపోయారు. అందుకు కారణం కొరటాల శివకు ఇంతవరకు ఫెయిల్యూర్​ లేదు. పైగా ఆయన ప్రతి చిత్రంలోనూ కమర్షియల్​ అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. గతంలో కొరటాల తెరకెక్కించిన శ్రీమంతుడు, భరత్​ అను నేను, జనతా గ్యారేజ్​, మిర్చి ఇలా ప్రతి చిత్రం ఏదో ఒక సందేశంతో ఉంటుంది.

ఇక ఆచార్యలోనూ చిరంజీవి నక్సలైట్​గా కనిపించబోతున్నట్టు సమాచారం. అంతేకాక దేవాలయాలు వాటి మీద జరిగే దోపిడీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన లిరికల్​ సాంగ్​ ‘లాహే లాహే’ సూపర్​ హిట్​ అయ్యింది. టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్​ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. ‘ఆచార్య’ చిత్రాన్ని మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్ టైనర్ బ్యానర్ సమర్పిస్తోంది. ఇవాళ ఈ మూవీ మేకర్స్ ‘ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి’ అంటూ ఓ ట్వీట్​, రామ్ చరణ్ ఓ స్టిల్ విడుదల చేసింది. దీనిని బట్టి ఈ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ వేగంగా సాగుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -