రంగస్థలం తర్వాత రామ్చరణ్ తేజ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. అందులో భాగంగా నటీనటుల ఎంపిక పూర్తవుతోంది. ఈ సినిమాల్లో టాలీవుడ్తో పాటు బాలీవుడ్ నటీనటులను తీసుకుంటున్నారని టాక్.
విలన్లను పవర్ఫుల్గా చూపించే బోయపాటి శ్రీనివాస్ అదే రేంజ్లో విలనిజం చూపే స్టార్ల కోసం వెతుకున్నాడు. ఈ సమయంలో వివేక్ ఒబెరాయ్ కనిపించాడు.‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులను సంపాదించుకున్న వివేక్ ఒబేరాయ్ ఈ సినిమాలో నటిస్తాడంట. ‘ఖైదీ నంబర్ 150’లో వివేక్ అనుకున్నారు కానీ కుదరలేదు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తోంది.
ప్రస్తుతం రామ్చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ చేస్తాడు. ఇక దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు.