మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ,బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ.దీపావళి సందర్భంగా విడుదల చేసిని సినిమా ఫస్ట్ లుక్కు సూపర్బ్ రెస్పన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. 49 సెకన్ల ఈ టీజర్ను మాస్ యాక్షన్ సీన్స్తో పవర్ ప్యాక్డ్గా రెడీ చేశారు.చరణ్ మాస్ బోయాపటి మార్క్ మాస్ క్యారెక్టర్లో ఇరగదీశాడు.ఎవడు అయితే నాకేంటీ రామ్ ఇక్కడ కొణెదల రామ్ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ టీజర్కే హైలెట్గా నిలిచింది.కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇక టీజర్ను చూస్తుంటే బోయపాటి గత సినిమాను గుర్తుకు తెస్తున్నాయి.యాక్షన్ సన్నివేశాలన్ని దమ్ము,సరైనోడు,జయ జానకి నాయక సినిమాలకు మాదిరిగానే ఈ టీజర్ను కూడా ఫుల్ యాక్షన్ సీన్స్తో నింపేశాడు బోయపాటి.మరి సినిమాలో అయిన కొత్తదనం చూపించాడో లేదో చూడాలి అంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.