Monday, April 29, 2024
- Advertisement -

ఆటాపాట‌కు పాతిక ల‌క్ష‌లు కావాలి

- Advertisement -

‘రంగ‌స్థ‌లం’ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ షాక్‌

సినిమాల‌కు సంగీతం ప్రాణం. ఒక్కోసారి సినిమాల‌ను సంగీతమే కాపాడుతాయి. ఆ విధంగా సినిమాల్లో సంగీతం ఉంటుంది. సినిమాకు సంగీతం త‌ప్ప‌నిస‌రి. అయితే ఒక్కో సంగీత ద‌ర్శ‌కుడిది ఒక్కో స్టైల్. టాలీవుడ్‌లోని సంగీత ద‌ర్శ‌కుల్లో దేవీ శ్రీ ప్ర‌సాద్‌ది ప్ర‌త్యేక సంగీతం. కుర్ర‌కారుకు అనుగుణంగా.. కుర్ర హీరోల సినిమాల‌కు మంచి బీట్ అందించ‌డం దేవీకే సాధ్యం. అన్ని పాట‌ల‌కు మంచి మ్యూజిక్ డీఎస్పీ అందిస్తాడు. ముఖ్యంగా ప్ర‌త్యేక గీతాలు అంటే ఐట‌మ్ పాట‌ల అంటే దేవీనే కొట్టాల‌నేంత క్రేజీ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో దేవీకి వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నారు.

ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమా ‘రంగ‌స్థ‌లం’ వ‌స్తోంది. ఈ సినిమాకు బృందానికి మాత్రం దేవీ శ్రీ ప్ర‌సాద్ ఒక షాక్ ఇచ్చార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మంలో తన ఆట‌పాట‌ల‌కు రూ.25 ల‌క్ష‌లు ఇచ్చుకోవాల‌ని కండీష‌న్ పెట్టాడ‌ని తెలుస్తోంది. ఇంత డిమాండ్ చేయ‌డానికి కార‌ణం ఉంది. ఆడియో, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో డీఎస్పీ ఓ ప్ర‌త్యేక స్టైల్‌. డీఎస్పీ ఉంటే ఆ స్టేజీపై యాంక‌ర్ అవ‌స‌రం లేదు. అన్నీ తానై న‌డిపిస్తాడు. త‌న పాట‌లు, ఆట‌లు, జోక్‌ల‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటూ షోకు హైలెట్‌గా నిలుస్తాడు. ఈ సంద‌ర్భంగా అత‌డికి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామ‌నుకున్నాడు అంతే.రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత న‌టిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వేస‌వి సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -