Saturday, May 4, 2024
- Advertisement -

అది చావు బతుకుల సమస్య అంటున్న రాజశేఖర్

- Advertisement -

మన హీరోల్లో చాలా తక్కువ మంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో రాజశేఖర్ ఒకరు. మెడిసిన్ విద్యని అభ్యసించిన రాజశేఖర్ మెడిసిన్ ని మాత్రం ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన నేషనల్ మెడికల్ బిల్ పైన ఆయన అభ్యంతరాలని వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్ వలన ప్రమాదం ఉంది అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

“కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్ నాన్సెన్స్. వ్యతికరేకత ని చూపిస్తున్న డాక్టర్లందరికీ నా సంఘీభావం ప్రకటిస్తున్నాను. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇష్టానుసారం ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతుల్లో పెట్టలేము. ఆరు నెలల్లో మెడిసిన్ ని ఎవరూ ప్రాక్టీస్ చేయలేదు. ఇదే కనుక జరిగితే నిజం గా ఎవరు అధికారికం గా డాక్టర్ అయ్యారు, ఎవరు కాలేదు అనే విషయం మనం అర్ధం చేసుకోలేము. మనం అందరం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే మన అందరికీ మొదటి యుద్ధం అవ్వాలి. ఇది చావు బతుకుల సమస్య. పేద వాళ్ళు, చదువుకొని వాళ్ళే దీని వలన ఎక్కువ గా బాధ పడతారు. క్రాష్ కోర్స్ చేసి డాక్టర్ అవ్వలేదు. దీనిని వ్యతిరేకించండి.” అని రాజశేఖర్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -