శ్రీమంతుడు దర్జాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.కొరటాల శివ తనదైన శైలిలో పండించిన గ్రామం తరహా కథతో కవ్వించే ప్రయత్నం చేశాడు.
ఇదంతా సినిమా ప్రేక్షకుల దృష్టిలో భాగానే ఉంది. కాని ట్రేడ్ దృష్టిలో సినిమా బిజినెస్ పైనే టాక్ నడిచింది. ఎందుకంటే ఇప్పటికే మహేష్ చిత్రాలను కొని రెండుసార్లు మునిగిపోయిన ఈరోస్ ఇంటర్నషనల్ కు ఈసారైన అదృష్టం కలిసొస్తుందో లేదోననే సందేహం వెంటాడుతుంది.ఆగడు,వన్ చిత్రాలను భారీ రేట్ కు ఈరోస్ సొంతం చేసుకుని రిలీజ్ హక్కులను సాధించింది.
కాని పైసలు పోగొట్టుకుంది.ఈసారి మాత్రం లాస్ట్ టూ టైమ్స్ పొగోట్టుకున్న అమౌంట్ ను కూడా సొంతం చేసుకునేలా కనిపిస్తోంది.విచిత్రమేమిటంటే సినిమాకు స్లో నేరేషన్ ,సాగతీతలు అనే కామెంట్స్ వచ్చినప్పటికీ అందరూ పాజిటివ్ టాక్ ఇవ్వడంతో పడిన ప్రతిచోట సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు.
మొదటి రోజే శ్రీమంతుడుకు దాదాపుగా 18 నుంచి 24కోట్ల మధ్యలో వసూల్లు వచ్చినట్లు తెలుస్తోంది.అంటే బాహుబలి తర్వాత ప్లేస్ లో్ తెలుగులో మహేష్ బాబుదే అన్నమాట.ఈ లెక్కన చూస్తే…ఈరోస్ కు నో కన్నీరోస్ అనుకోవల్సిందే.