సెలబ్రిటిస్ అందరూ వారానికో లేదా నెలలో కాని కలుస్తుంటారు.అది సెలబ్రిటీ కల్చర్లో ఓ భాగం. చాలమంది ఇలాగే చేస్తుంటారు.అందరూ కలిసి ఫోటోలు దిగడం స్పెషల్ అట్రాక్షన్గా మారుతుంది.ఇప్పుడు సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.కాకపోతే వేదిక వేరు.నారా లోకేష్- బ్రాహ్మణిల కుమారుడు దేవాన్ష్ మూడవ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలే వచ్చారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన,మంచు లక్ష్మీ ప్రసన్న,మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ లతో పాటు నారా బ్రాహ్మణి కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోలో అందరు తమకు తగిన డ్రెసింగ్ స్టైల్లో కనిపించారు.ఈ పిక్ని రాంచరణ్ భార్య ఉపాసన షేర్ చేసింది.ఉపాసన ఈ మధ్య మహేష్ కూతురు సితారతో ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.