తెలుగు సినీ పరిశ్రమలో ఈ విషయం వింటే అవాక్కవ్వాల్సిందే. సినిమా నిర్మించిన నిర్మాతకు, నటించిన హీరోకు తెలియకుండా తెలుగు సినిమాను విడుదల చేశారంట. టాలీవుడ్లో జరిగే కొన్ని సంఘటనలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఘటన శుక్రవారం (డిసెంబర్ 29) జరిగింది.
సందీప్ కిషన్ – లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ప్రాజెక్ట్ జెడ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి ప్రచారాలు లేకుండా సినిమా విడుదలయ్యింది. అయతే ఈ సినిమా విడుదలయ్యిందని ఎవరికీ తెలియదు. అందుకే చాలా తక్కువ థియేటర్లలో విడుదలయ్యింది. తమిళ్లో బాగానే ఆడిన మాయవన్ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి ప్రాజెక్ట్ జెడ్గా విడుదల చేశారు.
అయితే ఈ సినిమా విడుదల అయ్యిందని హీరో సందీప్ కిషన్ తెలియదంట. తనకు, నిర్మాతకు కూడా ఈ సినిమా విడుదల అవుతుందని ఎవరూ చెప్పలేదంట. ఇప్పుడు ఈ సినిమాపై పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనకు, నిర్మాతకు తెలియకుండా అనధికార ప్రింట్ను థియేటర్లలో విడుదల చేశారని, సినిమాలో తన వాయిస్ కూడా డబ్ కాలేదని వేరే ఎవరిదో ఉందని ఆరోపించాడు. అసలు ఈ సినిమాకు విడుదలకు తాము క్లియరెన్స్ ఇవ్వలేదని సందీప్ కిషన్ చెప్పాడు.
అయితే ఈ సినిమా విడుదలయ్యిందని సినిమా బాగుంది ఓ అభిమాని ట్వీట్తోనే తనకు తెలిసిందని చెప్పాడు. ఆ ట్వీట్ చూసి అప్పుడు షాక్కు గురయ్యాయని చెప్పడం గమనార్హం. ఇంకా సినిమాకు సీజీ వర్క్ – డబ్బింగ్ వర్క్ – నిర్మాత నుంచి క్లియరెన్స్ ఇవేవి ఇవ్వలేదట. మరి ఎవరు విడుదల చేశారు.. థియేటర్ల దాకా ఎలా వెళ్లిందో తెలియాలి. దీని గురించి విచారణ చేయాలని సందీప్ డిమాండ్ చేస్తున్నాడు.