Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రముఖ విలక్షణ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత!

- Advertisement -

తెలుగు లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నర్సింగ్‌ యాదవ్‌(52) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన..సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నర్సింగ్‌ యాదవ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేమీలు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ముఖ్యంగా ఆయన విలన్, కామెడీ విలన్ వేశాలు వేశారు. అన్ని భాషల్లో కలిపి ఆయన 300 పైగా చిత్రాల్లో నటించారు. హేమాహేమీలు సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నర్సింగ్ యాదవ్ స్వస్థలం హైదరాబాద్.

నటుడిగా నర్సింగ్‌ యాదవ్‌కు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ బ్రేక్‌ ఇచ్చారు. వర్మ ప్రతీ మూవీలో నర్సింగ్‌ యాదవ్‌కు తప్పనిసరిగా ఓ క్యారెక్టర్‌ ఉండాల్సిందే.  నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, తనయుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -