Monday, May 6, 2024
- Advertisement -

రాజ‌మండ్రి నుంచి వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున వీవీ వినాయ‌క్ బ‌రిలోకి

- Advertisement -

2019 ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో సినిమా రంగానికి చెందిన వాళ్లు రాజ‌కీయాల్లోకి రావాల‌ని చూస్తున్నారు. తాము ఓ అడుగు వేద్దామ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంద‌రు ఎన్నిక‌ల ముందు బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన టాప్ డైరెక్ట‌ర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. రాజ‌మండ్రి నుంచి పోటీ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం.

మాస్‌, యాక్ష‌న్ సినిమాల‌తో ఒక‌ప్పుడు సూప‌ర్‌డూప‌ర్ సినిమాలు తీసి ఇప్పుడు కొంచెం నెమ్మ‌దించిన డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్‌. అత‌డి సినిమాలు ప్ర‌స్తుతం అంత‌గా ఆడ‌డం లేదు. కానీ అత‌డిలో మాత్రం ప్ర‌తిభ త‌క్కువేమీ లేదు. చిరంజీవి పునఃప్ర‌వేశం ఇత‌డితోనే ఖైదీ నం-150తో అయ్యింది. ఇప్పుడు అత‌డు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇంటిలిజెంట్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను రాజ‌మండ్రిలో నిర్వ‌హించారు. ఇక రాజ‌కీయ నాయ‌కుల‌తో సంప్ర‌దింపులు చేస్తున్నారంట‌.

గ‌తంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతోనే రాజ‌కీయాల్లోకి వినాయ‌క్ అడుగుపెట్టాల‌నుకున్న వినాయ‌క్ ఆ త‌ర్వాత ఎందుకో కుద‌ర‌లేదు. అందుకే చాగల్లులో చాలా సేవా కార్యక్రమాలు చేప‌ట్టారు. అవ‌న్నీ ఏమైన‌గానీ మాత్రం ఇప్పుడు వ‌చ్చే ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నార‌ని తెలుస్తోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -