- Advertisement -
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథను యాత్ర అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రను మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి చేస్తున్నారు.సినిమాలో నటీనటుల ఎంపిక పూర్తి కావడంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నారు.
వచ్చేనెల 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2019 ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అయితే జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య నటిస్తున్నారని సమాచారం.