Monday, April 29, 2024
- Advertisement -

ఏపీ సీఎం జగన్ సంచలన కామెంట్స్..

- Advertisement -

ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కుట్ర రాజకీయాలు చేయడం కొత్త కాదని అప్పుడు బాబాయ్ వివేక్‌తో ఇప్పుడు తన సోదరి షర్మిలతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కుటుంబాలను చీల్చడమే కాంగ్రెస్ పార్టీ నైజం అని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై ఆధారాలతోనే కేసులు నమోదు చేసినట్లు జగన్ తెలిపారు.

కుట్ర రాజకీయాలు చేసే వారికి దేవుడు తగిన గుణపాటం చెబుతారని…ఎన్నికలు దగ్గరలో వున్నప్పుడు ఎవరూ కక్షపూరిత రాజకీయాలు చేయరన్నారు.ఎన్నికల ముందు ఎవరూ అపోజిషన్ నేతను అరెస్ట్ చేయాలని అనుకోరని సీఎం అన్నారు. అభ్యర్ధుల మార్పులపై నా సర్వేలు నాకున్నాయని తెలిపారు. చివరి నిమిషంలో మార్పులు చేసి అయోమయానికి గురవ్వడం కంటే ఇప్పుడే అభ్యర్ధులను మార్చుకోవడం మంచిదన్నారు జగన్.

ప్రజా వ్యతిరేకత వున్న నేతలకు టికెట్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని తెలిపారు జగన్. కాంగ్రెస్, బీజేపీలకు ఏపీలో బలం లేదని …సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తున్నామని .. కులాలు, ప్రాంతాల కోణంలోనూ కొన్ని మార్పులు చేశామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -