Saturday, May 18, 2024
- Advertisement -

ఏ సర్వే చూసినా జగనే..తగ్గెదేలే!

- Advertisement -

ఏపీలో ఏ సర్వే చూసినా జగన్ రెండోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా పలు సర్వే సంస్థలు ప్రజల నాడీ పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు వెల్లడించిన సర్వే రిపోర్టులు వార్ వన్‌ సైడేనని తేల్చి చెబుతున్నాయి. ఇక తాజాగా టైమ్స్ నౌ – ఈటీజీ తమ సర్వే రిపోర్టును వెల్లడించాయి.

లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ స్వింగ్‌లో ఉందని జగన్ జోరు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కుదేలవ్వడం ఖాయమని తేల్చి చెప్పింది. ఏపీలోని 25 పార్లమెంట్ సీట్లలోనూ 21 – 22 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్తాయని తెలిపింది.

ఇక అదే సమయంలో టీడీపీ – జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని ఇతర పార్టీలకు అవకాశం లేదని తెలిపింది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే మొత్తం 175 స్థానాల్లోనూ వైసీపీకి 147 నుంచి 154 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా టీడీపీ – జనసేన కూటమికి 21 నుంచి 28 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. మొత్తంగా ఏ సర్వే చూసినా జగన్‌కే జై కొడుతుండటంతో వైసీపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -