Thursday, May 2, 2024
- Advertisement -

బాలయ్యపై పోటీకి బీసీ మహిళ!

- Advertisement -

ఏపీ అసెంబ్లీకి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది దూకుడు పెంచారు సీఎం జగన్. సంక్రాంతి తర్వాత మొత్తం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనుండగా గెలుపు గుర్రాలను ఫైనలైజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపుర్ లో బాలయ్యకు పోటీగా ధీటైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ.

ఈ సారి హిందూపుర్‌లో బాలయ్య ఓడిపోవడం ఖాయమని, ప్రజా సంక్షేమాన్ని ఆయన గాలికొదిలేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని, హిందూపురం పార్లమెంటు నుంచి బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని వెల్లడించారు. ఇప్పటివరకు టిడిపి జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదని..ఏపీలో ఉనికి కొల్పోయిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. వచ్చే ఎన్నికలలో ఓటు బ్యాంకును చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలన్నింటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో 99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశామని ఆయన తెలిపారు. టికెట్ల కేటాయింపులో ఉన్న అసంతృప్తిని త్వరలోనే అధిగమిస్తామని… పార్టీ శ్రేణులను ఏకతాటి మీద ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తామని తేల్చిచెప్పిన పెద్దిరెడ్డి..రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -