- Advertisement -
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది బీజేపీ. సెకండ్ లిస్ట్లో 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇందులో తెలంగాణ నుండి ఆరుగురు అభ్యర్థులకు చోటు దక్కింది. నల్గొండ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ప్రకటించింది.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నాగ్పూర్ నుంచి పోటీ చేయనుండగా ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. ఫస్ట్ లిస్ట్లో 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తెలంగాణ నుండి 9 స్థానాలున్నాయి.
తెలంగాణ నుంచి వీరే..
ఆదిలాబాద్-గోడెం నగేశ్
పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్
మెదక్-రఘునందన్ రావు
మహబూబ్ నగర్-డీకే అరుణ
నల్గొండ-శానంపూడి సైదా రెడ్డి
మహబూబాబాద్-సీతారాం నాయక్