Sunday, May 5, 2024
- Advertisement -

బీజేపీలో కీలక పరిణామం..పోటీకి డీకే అరుణ దూరం

- Advertisement -

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సీనియర్ నేతలంతా పార్టీకి దూరమవుతుండగా తాజాగా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు గద్వాల జేజమ్మ డీకే అరుణ. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానిన తెలిపింది అరుణ. దీంతో ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయంపై అంతా షాక్‌కు గురవుతున్నారు.

గత ఎన్నికల్లో గద్వాల నుండి పోటీ చేసిన ఆమె…బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈయన డీకే అరుణకు దగ్గరి బంధువు. అప్పటినుండి డీకే వర్సెస్ బండ్లగా గద్వాల రాజకీయాలు నడుస్తున్నాయి. గద్వాల స్ధానాన్ని డీకే అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని భావించినా చివరి నిమిషంలో ఆమె పోటీ నుండి తప్పుకోవడం విశేషం. అయితే ఆమె పోటీ నుండి తప్పుకోవడం వెనుక సర్వేల్లో అనుకూలంగా లేకపోవడమేనని టాక్ వినిపిస్తోంది. అరుణ బదులు బీసీకి టికెట్ కేటాయిస్తామని చెప్పినా పోటీ నామమాత్రమే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాస్తవానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో డీకే అరుణకు మంచి పట్టుంది. ఆమె తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు భర్త డీకే సమరసింహారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేసిన అరుణ…జిల్లా రాజకీయాలను శాసించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో మెల్లమెల్లగా పట్టు కొల్పోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -