Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్‌ తీరుపై హరిరామ జోగయ్య ఆవేదన

- Advertisement -

జనసేనాని పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. తనను పవన్ కోవర్టు అనడంపై బాధతో కూడిన లేఖను రిలీజ్ చేశారు. ఈ మేరకు పవన్‌కు ఓ లేఖ రాసిన జోగయ్య… నా పార్టీ నా ఇష్టం.. నేను ఇలాగే నడుపుతా.. నచ్చినవాళ్ళే ఉండండి.. లేనివాళ్ళు వెళ్లిపోండి అంటూ పవన్ మాట్లాడటం బాధించిందన్నారు.

జనసేన బాగుకోసం… మా కాపుల ప్రయోజనాలు కాపాడేందుకు నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్లు లేవు. చంద్రబాబే సిఎం .. వేరేవాళ్లకు అవకాశమే లేదు అని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు నేను వైసిపి కోవర్ట్ నా ? ఆలోచించాలన్నారు. జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు వుంటే 24 సీట్లు ఇచ్చారు… ఈ ఘోరాన్ని ప్రశ్నించినందుకు నేను వైసిపి కోవర్ట్ నా…పవన్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదన్నారు.

జనసేన మద్దతు లేకుండా టిడిపి గెలవడం అసాధ్యం అసాధ్యం కాబట్టే చంద్రబాబు మీతో జతకట్టాడు…ఎన్నికలయ్యాక మీ స్థానం ఏంటో ఆలోచించుకోవాలన్నారు.
కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి లోకేష్ ను ముఖ్యంత్రిని చేస్తారనే భయం జనసైనికుల్లో ఉందని…అందుకే మీకు గౌరవం దక్కాలని తాను డిమాండ్ చేయడమే నేరమైందా అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి….నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుందని తేల్చి చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -