Monday, May 20, 2024
- Advertisement -

టీడీపీ కోటలో వైసీపీ పాగా వేసేనా?

- Advertisement -

విశాఖ తూర్పు..టీడీపీకి కంచుకోట. జగన్ హవాలోనూ టీడీపీ జెండా ఎగురవేశారు వెలగపూడి రామకృష్ణ బాబు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అప్పటి నుండి రామకృష్ణనే గెలుస్తూ వస్తున్నారు. మూడుసార్లు విశాఖ తూర్పులో గెలిచిన వెలగపూడి ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సార్లు వైసీపీపై విజయం సాధించగా ఈసారి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీగానే పోటీ ఉండనుంది.

వెలగపూడి మూడు సార్లు గెలిచారు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుందని భావిస్తున్నారు. ఇక వైసీపీ నుండి ఎంవీవీ సత్యనారాయణ బరిలో ఉన్నారు. గత రెండు సార్లు యాదవ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చిన వైసీపీ ఈసారి ఓసీకి టికెట్ కేటాయించింది.

రెండు లక్షల ఎనభై వేల ఓట్లు ఉన్న విశాఖ తూర్పులో బీసీల ఓట్లే 80 శాతం. హోరా హోరీ పోరుగా సాగనున్న విశాఖ తూపులో ఎవరు విజేత అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే టీడీపీతో పోలిస్తే వైసీప సేఫ్ జోన్‌లో ఉందని తెలుస్తోండగా టీడీపీ విజయాల పరంపరకు బ్రేక్ పడుతుందా అన్నది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -