ఏపీలో ఎన్నికల సంగ్రామం అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగా అప్పుడే ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తన మాటలతో వార్తల్లో నిలిచేది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు మళ్లీ ఏపీ రాజకీయాలపై దృష్టి సారించిన పాల్..తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణ నుంచి జనసేనను ప్రజలు తరిమేశారన్నారు. ఇక అదే సమయంలో చంద్రబాబుపై సెటైర్లు వేశారు పాల్. తన 14 ఏళ్ల పాలనలో బాబు పాలన అంతా అవినీతి మయమేనని..అవినీతి పాలనతో ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేక పోయారన్నారు. ఇక పవన్కు బంపర్ ఆఫర్ ఇచ్చారు పాల్. జనవరి ఒకటో తేదీ లోగా తమతో పొత్తుకి ముందుకు రావాలని…ఒకవేళ పవన్ ముందుకొస్తే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు.
చాలా మందికి ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం తెలియదని…యేసు క్రీస్తు మన పాపాల కోసం చనిపోవడం మేరీ క్రిస్మస్ అన్నారు. 200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, లోకం అంతా స్వార్థం, పాపం పెరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.