Monday, April 29, 2024
- Advertisement -

ఇకపై నా ప్రయాణం జగనన్నతోనే!

- Advertisement -

ఇకపై తన ప్రయాణం సీఎం జగన్‌తోనే అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. తాడేపల్లిగూడంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అనంతరం మాట్లాడిన నాని..జగన్ ఏం చేయమంటే అది చేస్తానని లిపారు.ఎంపీగా తన రాజీనామా అమోదం పొందిన వెంటనే వైసీపీలో చేరుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడని..కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని ఆరోపించారు.

చంద్రబాబు మోసగాడని ప్రంపంచం మొత్తానికి తెలుసు కానీ.. ఇంత పచ్చి మోసగాడని, దగా చేస్తాడని అనుకోలేదన్నారు. తన కుటుంబ సభ్యలతోనే తనపై దాడి చేయించే కుట్ర చేశారని ఆగ్రహ వ్యక్తం చేశారు.టీడీపీ కోసం, ప్రజల కోసం చాలా నిజాయితీగా కష్టపడ్డానని…సొంత వ్యాపారాలను పక్కన పెట్టానని చెప్పారు. తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రెండు వేల కోట్లు అని… బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజాల మీద మోసినట్టు చెప్పుకొచ్చారు.

తాను పార్టీలో ఉండటం ఇష్టంలేదంటే చెప్పండి వెళ్లిపోతా అని ఆరోజే చంద్రబాబును అడిగానని.. కానీ నువ్వు ఉండాల్సిందే అని సర్దిచెప్పి ఎన్నో అవమానాలు చేశారన్నారు. విజయవాడ అంటే నాకు ప్రాణం.. ఏమైనా చేస్తానని చెప్పారు. విజయవాడ రియాలిటీ.. అమరావతి ఓ కల అంటూ నాని తెలిపారు. తన విషయంలో టీడీపీ ప్రోటోకాల్ విస్మరించిందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఖాళీ కాబోతోందని..ఇప్పుడు జగన్‌ను కూడా టికెట్ అడగనని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -