Tuesday, April 30, 2024
- Advertisement -

సరదాకే చేసినా…చంద్రబాబే షాక్ తిన్నారు!

- Advertisement -

నారా భువనేశ్వరి…చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో తరచూ వినిపిస్తున్న పేరు. బాబు అరెస్ట్ తర్వాత ఎన్టీఆర్ తనయగా సెంటిమెంట్‌ను క్యాచ్ చేసుకునేందుకు నిజం గెలవాలి అనే కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. ఇక చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయినా ఆమె ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే వార్తలు మాత్రం ఆగలేదు.

ఇలాంటి తరుణంలో కుప్పంలో పర్యటిస్తున్న భువనేశ్వరి చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను కుప్పం నుండి పోటీ చేస్తానని…మీ మద్దతు చంద్రబాబుకా, నాకా చెప్పాలంటు బాంబు పేల్చారు. 35 ఏళ్లుగా చంద్రబాబును గెలిపించారు..ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇద్దరూ కావాలంటూ సభకు వచ్చిన వారు చేతులెత్తగా ఒకరి పేరే చెప్పాలని కామెంట్ చేశారు. అయితే తాను ఇదంతా సరదాకే మాట్లాడనని ఎప్పుడూ సీరియస్‌గా ఉండొద్దని సూచించారు.

ఇక భువనేశ్వరి చేసిన కామెంట్స్ క్షణాల్లో వైరల్‌గా మారగా ఏం జరుగుతుందో తెలియక టీడీపీ నేతలే కాదు చంద్రబాబు సైతం ఖంగుతిన్న పరిస్థితి నెలకొంది. అయితే భువనేశ్వరి సరదాకే ఈ వ్యాఖ్యలు చేసినా టీడీపీ నేతల్లో మాత్రం చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -