వరుస చేరికలతో జోష్ మీదున్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ పార్టీ మారేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ నుండి పోటీ చేద్దామని ఆశీంచి పార్టీలో చేరిన వెంకటేష్ను కాదని ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకి సీటు ఇచ్చింది కాంగ్రెస్. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వెంకటేష్…బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించింది ఆ పార్టీ. ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించగా నేతకాని వెంకటేష్ పార్టీలో చేరితో శ్రీనివాస్ను తప్పిస్తారని తెలుస్తోంది. బీజేపీ నుండి వెంకటేష్ను నిలబెడితే గట్టి పోటీ ఇస్తారని బీజేపీ భావిస్తోంది.
ఇప్పుడు ఇదే పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్టీ మారిన నేతలకే టికెట్లు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ ఉండగా బీఆర్ఎస్ నుండి చాలామంది సీనియర్లు పోటీకి విముఖత చూపించడం విశేషం.