- Advertisement -

హార్ముజ్ జలసంధి మూసేసిన ఇరాన్..భారత్‌పై ప్రభావం?

- Advertisement -

హార్ముజ్ జలసంధిని ఇరాన్ తాత్కాలికంగా మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

పర్షియన్ గల్ఫ్‌కు ప్రవేశ ద్వారం అయిన హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ మార్గం మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

భారత్ తన ముడి చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి హార్ముజ్ మార్గం అంతరాయం కలిగితే సరఫరా శృంఖలపై ప్రభావం పడే అవకాశముంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

అయితే భారత్ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు, వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -