Wednesday, May 8, 2024
- Advertisement -

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల..

- Advertisement -

అంతా ఊహించిందే జరిగింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలె తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఇక తన పార్టీ విలీనం సందర్భంగా కాంగ్రెస్‌ కోసం అహర్నిషలు పనిచేస్తానని,పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా నిర్వర్తిస్తానని తెలిపారు.

ఇటీవలె సౌత్‌లో పట్టు సాధిస్తోంది కాంగ్రెస్. కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రాగా ఏపీలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా షర్మిలను రంగంలోకి దించింది కాంగ్రెస్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతను షర్మిలా భుజాన పెడితే పార్టీని నష్టమా ? లాభామా ? ఇలా అనేక అంశాలను పరిశీలించిన అనంతరం షర్మిలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్.

నిన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -