నాని సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోరు. ఆమె తన అందాలతో అదరహో అనిపించింది. అదే రేంజ్ లో ఆమె బాలీవుడ్ లో కూడా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఆమెని మించిపోయి బాలీవుడ్ ముద్దుగుమ్మలు ముందుకి రావడంతో ఈమె వెనకపడిపోయింది. అయితే అమీషా ఇప్పటికే తన అందాలతో కుర్రాకారును మాయ చేస్తోంది. అయితే ఇక అసలు విషయంలో వస్తే.
ఈ మధ్య ఈ అమ్మడు కుర్ర హీరో రణబీర్ కపూర్ ని గోకేసే ప్రయత్నం చేస్తుందని సమాచారం. ఈ మధ్య కరీనా కపూర్ తండ్రి రణ్ ధీర్ పుట్టినరోజు వేడుకలకు అమీషా పిలవని పేరంటంగా హాజరైపోయిందంట. అక్కడ అందరితో కలివిడిగా మెలుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ తెగ హడావిడి చేసిందట. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన అమీషా.. బాలీవుడ్ ప్లే బాయ్ గా పేరు తెచ్చుకున్న కుర్రహీరో రణ్ బీర్ కపూర్ కి గాలం వేసి తన కోరిక తీర్చుకునే ప్రయత్నం చేసిందంట. ఓ ఫిల్మీ ఈవెంట్కు హాజరైన అమీషా రణ్ బీర్పై ప్రత్యేక దృష్టి పెట్టి అతనితో ఏకాంతంగా కలవాలని అడిగిందంట.
దానికి అప్పుడు ఒకే అన్న రణబీర్ తరువాత ఎవ్వరికీ తెలీకుండా పార్టీ నుంచి జారుకున్నాడట. దీంతో అమ్మడు బాగా డిజప్పాయింట్ అయిందని వినికిడి. గతంలోనూ తనతో క్లోజ్గా మూవ్ అయిన అమీషాతో అఫైర్ ఉందంటూ పుకార్లు రావడంతోనే రణబీర్ ఈసారి జాగ్రత్త పడ్డాడని తెలుస్తోంది. అయితే అమీషా మాత్రం తనని పిలిచింది వేరే విషయం మాట్లాడటానికి అని, అది తెలియకుండా రణబీర్ ఆమెని దూరంగా పెట్టాడని తెలుస్తుంది.