Wednesday, May 15, 2024
- Advertisement -

మద్యం తాగి రచ్చ రచ్చ చేయడంపై అనసూయ ఫైర్..!

- Advertisement -

యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లు అడిగిన ప్రశాలకు జవాబు ఇస్తూ ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ అనసూయను అడిగిన ప్రశ్నకు ఆమెకు చిర్రెత్తించింది. దాంతో అతనికి సీరియస్ కౌంటర్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో తన రెగ్యులర్ అప్‌డేట్స్ పంచుకుంటూ, ఫ్రెష్ అండ్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.

ఈ భామకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా అభిమానులతో ఆన్‌లైన్ చాటింగ్ చేసింది అనసూయ. చాటింగ్ లో భాగంగా ”తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ రచ్చ చేశారట కదా?” అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. అందుకు వెంటనే రియాక్ట్ అయిన అనసూయ అతనిపై ఫైర్ అయింది. ”ఈ ‘అట’ అనే పదాలు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుంది. కానీ నిజాలు వేరే ఉంటాయని, పరిణతి చెందితే నీకు కూడా అర్థమవుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకా పరిణతి చెందలేదేమో” అంటూ కౌంటర్ వేసింది.

గతంలోనూ చాలాసార్లు నెటిజన్లు చేసిన వల్గర్ కామెంట్స్‌పై ఫైర్ అయింది అనసూయ. ఇక బుల్లితెరపై మెరుస్తూనే వెండితెరపై కూడా రాణిస్తోంది అనసూయ. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో నటిస్తోంది. ‘ఆచార్య’ సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ కోసం అనసూయను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -