Friday, April 19, 2024
- Advertisement -

బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలే ముఖ్య అతిథి ఎవరంటే ?

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో 14వ వారం ఎలిమినేషన్‌కు మొత్తం ఐదుగురు నామినేట్ కాగా.. అందులో బాబా భాస్కర్, శ్రీముఖి సేఫ్ అయ్యి ఫైనల్‌కు చేరారు. ఇక శివజ్యోతి, వరుణ్ అలీ నామినేట్ లో ఉన్నారు. వీరిలో శివజ్యోతి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చింది. దాంతో వరుణ్, అలీ కూడా ఫైనల్ కు వెళ్లిపోయారు. తుది పోరులో రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి పోటీ పడనున్నారు.

వీరిలో విజేతగా నిలిచిన ఒక్కరు రూ 50 లక్షలు గెలుచుకోనున్నారు. అయితే వీరిలో ఎక్కువ పోటీ రాహుల్ శ్రీముఖి మధ్య ఉంది. ఎందుకంటే రాహుల్ చాలా బాగా ఆడుతున్నాడని ప్రేక్షకులు తెల్చేశారు. శ్రీముఖికి కూడా రాహుల్ తో సమానంగా ఓట్లు పడుతున్నాయి. కాకపోతే వీరిద్దరికి హౌస్ లో పడటం లేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో గొడవపడుతూ ఉంటున్నారు. ఇది పక్కనపెడితే ఇక రాహుల్ ని ఎలాగైన గెలిపించాలని అతని ఆర్మీ చాలా బాగా కష్టపడుతుంది.

ఇటు శ్రీముఖి ఫ్యాన్స్ కూడా ఎలాగైన గెలిపించాలని తెగ కష్టపడుతుంది. మరింత ఆసక్తికరంగా మారే గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా ఎవరు ఊహించని హీరో రాబాతున్నారు. అతనే మెగాస్టార్ చిరంజివి అని తెలుస్తోంది. చిరు చేతుల మీదగా టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారట. ఇక హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారట. సో గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ఉండనుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -