- Advertisement -
బాలీవుడ్ జోడి దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వినబడుతున్నాయి.వీరిద్దరు నవంబర్ 10న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారనే ప్రచారం సాగుతోంది. వీరు పెళ్లి ఇండియాలో కాదని ఇటలీలోని కోమో సరస్సు సమీపంలోని అద్భుత లొకేషన్స్లో జరగనుందని చెబుతున్నారు. ఉత్తర ఇటలీలోని లంబార్డీ ప్రాంతంలో మైమరిపించే ప్రకృతి సోయగాల నడుమ ఈ సరస్సు ఉండటంతో వివాహ వేదికగా ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నట్టు తెలిసింది.
వీరిద్దరు గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారు.అయితే వీరి పెళ్లి గురించి ఇటు రణ్వీర్ కాని అటు దీపికా కాని ఎవరు స్పందించకపోవడం విశేషం.గతంలో విరాట్ కోహ్లి,అనుష్క శర్మలు ఇలాగే విదేశాలలో వివాహం చేసుకున్నారు.వీరి పెళ్లికి లాగే రణ్వీర్,దీపికా వివాహనికి అతి కొద్దిమంది వస్తారని సమచారం.