Sunday, April 28, 2024
- Advertisement -

కుమారి రేంజ్ పెరిగింది…!??

- Advertisement -

అలా ఎలా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది హెబ్బా పటేల్. ఆ సినిమా మంచి మర్కులే తెచ్చుకున్నా హెబ్బాకు పెద్దాగా పేరు రాలేదు. రీసెంట్ గా సుకుమార్  నిర్మించిన కుమారి 21 ఎఫ్‌ సినిమాలో రాజ్ తరున్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

కుమారి సినిమాతో హెబ్బా క్రేజీ ఇమేజ్ సంపాదించుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటుంది. దాంతో హెబ్బా మంచి దూకుడు మీద ఉంది. కుర్ర హీరోల ప‌క్క‌న న‌టించేందుకు హెబ్బాకు ఛాన్సుల మీద ఛాన్సులు వ‌స్తున్నాయి.  

ఇప్పటికే విష్ణు, రాజ్ తరున్ హీరీలుగా నటిస్తున్న సినిమాలో హెబ్బా హీరోయిన్‍గా ఓకే అయింది అలాగే నిఖిల్ సినిమాతో సహా మరిన్ని సినిమాల్లో ఆమె అవకాశాలు సంపాదించుకుంది.

దీంతో అమ్మడు రేమునరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుందట. ఒక్కొక్క చిత్రానికి 50 లక్షలు డిమాండ్ చేస్తుందని సమచారం. మొత్తానికి అమ్మడికి డబ్బుకు డబ్బు సినిమాలకి సినిమాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -