టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కొత్త బాధ్యతలు చేపట్టనుందని తెలుస్తోంది. 2011లో ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు. చాలా కాలంగా లక్ష్మిప్రణతి హౌస్వైఫ్ గానే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెట్టాలనే దిశగా ప్లాన్ చేస్తోందట లక్ష్మిప్రణతి.
ఈమేరకు త్వరలో ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ‘యువ’ అనే పేరుతో ఈ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయని టాక్. గతంలో లక్ష్మి ప్రణతి తండ్రికి ఓ మీడియా ఛానల్ నడిపించిన అనుభవం ఉన్నందున, దాని మీద ఐడియా ఉండటంతో ఈ ఎంటర్టైన్మెంట్ ఛానెల్కి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె రెడీ అయిందట.
అయితే లక్ష్మి ప్రణతి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎన్టీఆర్ ప్రోత్సాహం కూడా ఉందని తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుందట. ఇక ఎన్టీఅర్ ప్రసుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడు.
మోక్షజ్ఞకి హీరో కావడం ఇష్టం లేదేమో.. అందుకే ఇలా..!
బాలయ్యకు బర్త్ డే విష్ చేస్తూ మెగా ఫ్యామిలీని తిట్టిన శ్రీరెడ్డి..!