జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ణాత వాసి సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమా తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సుయాత్ర చేయడానికి జనసేన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలింనగర్ లో ప్రస్తుతం ఓ టాక్ వినిపిస్తోంది.
పవన్ తో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ చాలా కాలంగా భావిస్తోందట. దీని కోసం పవన్ కు రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారట. తమ సినిమాకు పవన్ ‘ఓకే’ చెబితే… ఆయన రెమ్యునరేషన్ తో కలిపి రూ. 80 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాదు, ఎన్నికల ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ అయోమయంలో పడిపోయారట. ఏం చేయాలన్న విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట. ఒక వేళ పవన్ ఓకే చెబితే… దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా పవన్ అవతరిస్తారు. సినిమాకు ఓకె చెబితె మరోసారి పవన్పై విమర్శలు రావడం ఖాయం. మరి పవన్ ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తి జనసేన పార్టీలో నెలకొంది.