Thursday, May 9, 2024
- Advertisement -

డ్రగ్స్ రాకెట్ లో నందుకు చుక్కలు చూపిస్తున్నారు

- Advertisement -

ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ తో పెట్టుకుంటే.. దిమ్మతితిగాల్సిందే. డ్రగ్స్ రాకెట్ లో నోటిసులు అందుకున్న హీరోలు.. హీరోయిన్స్ అంటూ.. కొందరి పేర్లు బయటకు వచ్చాయి. నోటిసులు అందుకున్న కొందరు స్పందిస్తే.. మరి కొందరు మాత్రం తప్పించుకొని తీరుగుతున్నారు. అయితే ఇంకొందరు.. వీడియో రూపంలో ఏదో ఒకటి చెప్పి సైలెంట్ అవుతున్నారు. అయితే ఒక్కరు మాత్రం ఓవర్ గా రియాక్ట్ అయ్యారు.

మీడియా వాళ్లు స్టూడియోలకు పిలిచారని.. నేను మంచివాడిని.. తురుంఖాన్ ను అంటూ విర్రవీగాడు. టీవీ స్టూడియోల్లో లైవ్ లు ఇచ్చి.. నా జీవితం.. నా కెరీర్ అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ తో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తీరును ఎక్కిదిగేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా ఆ డిపార్ట్ మెంట్ ఆఫీస్ కే వెళ్లి మరీ నిలదీశాడు. వాళ్లు సింపుల్ గా కేసును సీసీఎస్ పోలీసులకు డైవర్ట్ చేశారు. అంతటితో నేను సేఫ్ అనుకుని హ్యాపీగా ఉండిపోయాడు యువ నటుడు, ప్రముఖ సింగల్ గీతామాధురి భర్త నందు. అయితే ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఇంత రచ్చ చేసి.. తన హీరోయిజంను చూపించిన నందుకి ఆధారాలతో సహా నోటీసులు అందించటానికి పెద్ద ప్రిపరేషన్ చేశారు ఎక్సైజ్ అధికారులు.

కాల్ లిస్ట్ లో నీ నెంబర్ ఉందో లేదో తెలియాలి అన్నా.. ఆ నెంబర్ నీది కాదని ఫ్రూ చేసుకోవాలన్నా.. విచారణకు హాజరవ్వు అంటూ స్వయంగా నోటీసులు అందించటానికి రెడీ అయ్యారు. టీవీల్లో కూడా నీ పాతివ్యత్యాన్ని నిరూపించుకునేది.. విచారణకు హాజరయ్యి చెప్పమ్మా అంటూ ట్విస్ట్ ఇచ్చారట. విషయం పసిగట్టిన హీరో నందు.. నోటీసులు స్వయంగా తీసుకునేందుకు అధికారుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని తెలుస్తోంది. మొత్తంగా సినీ పెద్దలనీ కాదని.. ఒంటరిగా యుద్ధంగా చేద్దామనుకుని బొక్కబోర్లా పడ్డాడని సినీ ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -