Monday, May 6, 2024
- Advertisement -

షూటింగ్‌లకు డుమ్మా..నిరాశలో బాలయ్య ఫ్యాన్స్‌!

- Advertisement -

నందమూరి బాలయ్య ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు. అఖండ సక్సెస్ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు బాలయ్య. ఇందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా కాగా తర్వాత కొల్లి బాబీతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో సినిమాను లైన్‌లో పెట్టాడు. ఇక బోయపాటితో సినిమా పూర్తి రాజకీయ నేపథ్యంలో ఉండనుందని..ఏపీలో ఎన్నికలకు ముందు సినిమాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇక బాలయ్య 108 మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది కూడా. దీనికి భగవంత్ కేసరి అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తన బావ,టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు ఓ వైపు సినిమాలను మరోవైపు పాలిటిక్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన బాలయ్యకు ఇప్పుడు పూర్తిస్థాయి పొలిటిషియన్‌గా మారాల్సి వచ్చింది.

అంతేగాదు చంద్రబాబు బాధ్యతలను స్వయంగా తీసుకుని కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పూర్తిస్ధాయిలో పాలిటిక్స్‌పైనే బాలకృష్ణ దృష్టిసారించే అవకాశం ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక,అసంతృప్తులు వీటిన్నింటిని మేనేజ్‌ చేయడం తలకు మించిన భారం. ఈ నేపథ్యంలో ఎన్నికలయ్యే వరకు సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. దీంతో ఫ్యాన్స్‌కు ఓ వైపు ఆనందం ఉన్నా తమ అభిమాన నటుడిని వెండితెరపై చూడలేకపోతున్నామనే బాధ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -