పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ప్లాప్ వచ్చిన అతని స్థాయి మాత్రం తగ్గదు అంటూన్నారు పవన్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన్ సినిమా ప్లాపైనా, హిట్టయినా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్, టాప్ డైరెక్టర్లు, నిర్మాతల్లో ఆయనతో చేయాలనే కోరిక తగ్గక పోవడమే ఇందుకు కారణం. పవన్ కళ్యాణ్ గత సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించిన పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణం అయ్యాడు. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఈ సినిమా రిజల్టు పట్టించుకోకుండా వెంటనే పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు. ఈచిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా తన స్నేహితుడు శరత్ మరార్ కే అప్పగించారు పవన్.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఎస్ జే సూర్య సినిమా కంప్లీట్ కాకముందే మరో సినిమాకి రెడి కాబోతున్నాడు పవర్ స్టార్. జల్సా, అత్తారింటికి దారేది వట్టి సినిమాలు తీసినా త్రివిక్రమ్ తో పవన్ ఓ భారీ సినిమా తీయబోతున్నాడు. అ ఆ సినిమాని నిర్మాత రాధ కృష్ణ పవన్, త్రివిక్రమ్ సినిమాని నిర్మించనున్నాడు అని తెలుస్తుంది. ఈ చిత్రాన్నికి కూడా పవన్ 26 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. భారీ అంచనాలు ఉన్న ఈ కాంబినేషన్ పై ఏ ఎలాంటి సినిమా వస్తుందో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్లాప్ వచ్చిన పవన్ రెంజ్ ఏ మాత్రం మారదు అనడానికి ఇదే ఉదాహరణ!