మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ఇటీవల దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ని ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం కూడా సత్కరించింది. దీనిపై దర్శకుడు వర్మ తనదైన శైలీలో స్పందించిన సంగతి తెలిసిందే.
శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం, శ్రీ బిందేశ్వర్ పాఠక్ల గురించి నేను ఎప్పుడూ వినలేదు కానీ వారిని మెగాస్టార్తో సమానమైన స్థితిలో ఉంచడంతో తనను బాధించిందన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం విషయంలో తనకు థ్రిల్ లేదని..ఒకవేళ చిరు హ్యాపీగా ఉంటే తాను ఉన్నట్టేనని సెటైర్ వేశారు. ఇక చిరు అంటేనే పడని వర్మ వేసిన సెటైర్ వైరల్గా మారింది.
ఇక తాజాగా మరోసారి ఈవివాదంపై స్పందించారు ఆర్జీవీ. తన ఉద్దేశ్యంలో చిరంజీవితో పోల్చితే మిగిలిన ఇద్దరు సమానం కాదు అని, ఆ స్థాయి వ్యక్తులు కాదు అని వివరణ ఇచ్చారు నా దృష్టిలో మెగాస్టార్ గొప్ప స్థాయిలో ఉన్నారు, మిగిలిన ఇద్దరు అంతటి పాపులర్ వ్యక్తులు కాదు కాబట్టి చిరంజీవిని తగ్గించినట్టు అవుతుందని కదా అని వెల్లడించారు. ఒక మెగాస్టార్ అభిమానిగా అది తనకు నచ్చలేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్జీవీ దర్శకత్వం వహించిన వ్యూహాం, శపథం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.