వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రోజుకో ట్వీట్తో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై స్పందిస్తూ సెటైర్ వేశారు. చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ హైదరాబాద్, ఏపీ, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ఐటీ ఉద్యోగులు సరే.. అసలు లబ్ధిపొందిన వారు ఎక్కడ?..వందో, రెండు వందల మందో హైదరాబాద్ ఐటీ ఎంప్లాయిస్ రాజమండ్రి జైలు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే.. కానీ, స్కిల్ స్కీంలో డైరెక్ట్ గా లబ్ధిపొందారని చెప్పబడుతున్న రెండు లక్షల మంది ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. లేటుగానైనా లేటెస్ట్గా ఆర్జీవీ స్పందన అందరిని ఆలోచింప చేస్తోంది.
వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తొలి రెండు రోజులు ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన హంగామా అంతాఇంత కాదు. గ్రామాల్లో ఎవరు చనిపోయినా చంద్రబాబు అరెస్ట్కు మనస్తాపంగా చనిపోయారని ప్రచారం చేశారు. అయితే ఇది ప్రజల్లో బుమారాంగ్ అయింది. బాబుతో లబ్దిపొందిన వారు ఒక్కరు లేదా వారి కుటుంబాల్లోని వ్యక్తులు ఎవరు మనస్తాపానికి గురై చనిపోవడం లేదు అని ఓ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించగా ఆ వీడియో వైరల్గా మారింది. దీంతో ఎల్లో మీడియా ఆ ప్రాపగాండను పక్కకు బెట్టి ఐటీ ఉద్యోగులతో ధర్నా ఎపిసోడ్ తెరపైకి తీసుకొచ్చిన అది పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు.
రోజుకో ట్వీట్తో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఆర్జీవీ. చంద్రబాబు ఉన్న గదిలో దోమలు దూరాయని, ఆయన ఇబ్బంది పడుతున్నారంటూ లోకేష్ చేసిన ఆరోపణలను ఉద్దేశించి సెటైర్ వేశారు. ఇది రక్త చరిత్ర కాదని దోమ చరిత్ర అంటూ ఎద్దేవా చేవారు. ఇక ప్రస్తుతం ఆర్జీవీ చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యూహం సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.