వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. పుష్ప సక్సెస్ తర్వాత ఈ అమ్మడుకు బాలీవుడ్లో మరింత క్రేజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. దాంతో రెమ్యూనరేషన్ను అమాంతం పెంచేసింది. ఛలో’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన ఈ బ్యూటీ గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం పుష్ప సక్సెస్గా బాగా ఎంజాయ్ చేస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. దీంతో పాన్ ఇండియా క్రేజ్ను క్యాష్గా మల్చుకునే పనిలో పడింది రష్మిక. పుష్ప సక్సెస్ తర్వాత నిర్మాతల నుంచి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా ఉమెన్ సెంట్రిక్ మూవీ కోసం గీతా ఆర్ట్స్ బ్యానర్ సంప్రదించినప్పుడు… రష్మిక జీఎస్టీతో కలిపి రూ. 3కోట్ల వరకు డిమాండ్ చేసిందట.
రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పుష్ప సెకండ్ పార్ట్కు కూడా 3కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్.