దర్శకుడు సుజీత్ ఒక్కసినిమా అనుభవంతో ప్రభాస్తో సినిమా చేసే చాన్స్ కొట్టేశాడు.మొదటి సినిమా రన్ రాజా రన్ 20 కోట్ల బడ్జెట్తో తెరక్కెంచిన సుజీత్కు రెండువ సినిమా ప్రభాస్తో చేసే అవకాశం వచ్చింది.ప్రభాస్ కూడా సుజీత్ చెప్పిన లైన్కు ఫిదా అయ్యి అతనికే చాన్స్ ఇచ్చాడు.సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరు తెలుగు సినిమా నెస్ట్ లెవల్కు తీసుకువెళ్లుతుందని భావించారు.పైగా బాహుబలి తరువాత సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.హీరో ప్రభాస్కు దర్శకుడు సుజీత్కు మధ్య షూటింగ్లో విభేదాలు ఏర్పడ్డాయని అనేక వార్తలు వచ్చాయి.
పైగా ఇప్పటీకే సినిమాకు 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టించాడు దర్శకుడు.ఈ కుర్ర దర్శకుడుని నమ్ముకుని ఎలా 150 కోట్లు ఖర్చు పెట్టారు అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు సుజీత్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.విబేధాలు ఉన్నాయని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సాహో చిత్రీకరణ చాలా సాఫీగా సాగుతోందని సుజీత్ వివరణ ఇచ్చాడు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తెలుగు తెరకు పరిచియమవుతుంది