రేణూదేశాయ్ పవన్ తో విడిపోయిన తర్వాత కొంత కాలం సైలెంట్గా ఉన్న రేణూ కొద్ది రోజులక్రితం రెండో పెళ్ళిచేసుకొనే ఆలోచన ఉందని వెల్లడించింది. రేణు పవన్కళ్యాణ్ నుంచి 2010లో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యతో పుణెలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
ప్రస్తుతం తెలుగు బుల్లితెరమీద పాపులర్ డ్యాన్స్ పోగ్రాం అయన నీతోనె డ్యాన్స్కు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన రెండో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. తాను రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఫ్యాన్స్ మరో పెళ్లి చేసుకోవడం కుదరదంటూ నానా రచ్చ చేసిన విషయాన్ని ఆమె మరోసారి ప్రస్తావించారు. ఇది ఇండస్ట్రీలో హాట్గా మారినం సంగతి తెలిసిందే.
విడాకుల తర్వాత ఒంటరిగా ఉండబోతున్న తనకు తోడు కావాలని..అనారోగ్యం పాలయితె తనను చూసుకొనె భర్త కావాలని రేణు తెలిపింది. అయితె ఈవిషయం తల్లిదండ్రులకు చెప్పగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారని….పెద్దలు కుదిర్చిన పెళ్లినె చేసుకుంటానని తెలిపింది. ఇండస్ట్రీ, రాజకీయరంగంలో ఉన్నా వాల్లను పెళ్లి చేసుకోనని చెప్పింది.
ఇక తనను మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తోన్న వారిలో తన కొడుకు అకీరా కూడా ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది రేణు. ఇక తనకు రాబోయే భర్త తన ఇద్దరు పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని… మంచి మనసున్న వ్యక్తి అయితే ఇంకా బెటర్ అని రేణు చెప్పింది.