Saturday, May 11, 2024
- Advertisement -

బాలయ్యకు భయపడి.. సాయి ధరమ్ వెనక్కి తగ్గాడు

- Advertisement -

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అక్కడ పోటీ ఉండటంతో సెప్టెంబరు 1కి వాయిదా పడింది. ఆ టైంకి విడుదల ప్లాన్ చేస్తుండగా.. దసరాకు రావాల్సిన పైసా వసలు అనుకోకుండా సెప్టెంబరు 1కి రిలీజ్ కు రెడీ అయ్యింది.

అయితే బాలయ్య పూరి కాంబినేషన్ లో సినిమా కావడంతో.. ‘జవాన్’ సినిమా యూనిట్ భయపడింది. తేజుతో పాటు దర్శకుడు బి.వి.ఎస్.రవి కెరీర్‌కు ఈ మూవీ చాలా కీలకం కావడంతో రిస్క్ ఎందుకని ఆ వీకెండ్‌ను బాలయ్య సినిమాకే వదిలేసింది. కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తితో రీషూట్లు కూడా అవసరమైనప్పటికీ.. సెప్టెంబరు 1న పోటీ లేకపోవడంతో అన్ని పనులూ పూర్తి చేసి అనుకున్న తేదీకే సినిమాను రిలీజ్ చేసేసేవాళ్లు. సెప్టెంబరు 1 నుంచి తప్పుకున్నాకే ఈ సినిమా విడుదలకు మరింత సమయం తీసుకోవాలని అనుకున్నారు. దీంతో ‘జవాన్’ అక్టోబరుకు వాయిదా పడిపోయింది.

కానీ పైసా వసూల్ గురించి భయపడకుండా.. ముందు అనుకున్నట్లే సెప్టెంబరు 1న యధావిధిగా సినిమాను రిలీజ్ చేసేసినా ఇబ్బంది లేకపోయింది. ఇలా రెండు సినిమాలు ఫోటీ పడినప్పుడు ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే.. రెండో సినిమాకు అది పెద్ద అడ్వాంటేజీ అయ్యేది. ‘జవాన్’ పర్వాలేదు అనిపించుకున్న.. అది మంచి సక్సెస్ అయ్యేది. పైసా వసూల్ తో పోటీకి కంగారు పడి.. ఈ సినిమా దాదాపు రెండు నెలలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీని వల్ల నిర్మాత కు చాలా నష్టమే కలిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -