Sunday, May 19, 2024
- Advertisement -

కోబ‌లి స్ర్కిప్టు తిర‌గ‌రాసే ప‌నిలో త్రివిక్ర‌మ్‌!

- Advertisement -

ఇద్ద‌రు మిత్రులు ముచ్చ‌ట‌గా మూడో సినిమా తీస్తున్నారు. అవును ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబో మ‌ళ్లీ సెట్ అయ్యింది. అ.ఆ త‌ర‌వాత త్రివిక్ర‌మ్ చేయ‌బోయే సినిమా ఇదే. అ.ఆ త‌ర‌వాత వెంట‌నే సూర్యతో ఓ సినిమా చేయాల్సింది. కానీ త్రివిక్ర‌మ్ ఆ ఆలోచ‌న విర‌మించుకొన్నారు. ఇప్పుడు వ‌వ‌న్ కోసం సినిమా చేయ‌డానికి స‌మాయాత్తం అవుతున్నారు.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎస్‌జె.సూర్య‌తో జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబ‌రులో పూర్త‌వుతుంది. ఆ వెంట‌నే త్రివిక్ర‌మ్ సినిమా మొద‌లెట్టేస్తారు. అత్తారింటికి దారేది త‌ర‌వాత కోబలి సినిమా గురించి మాట్లాడుకొన్నారు. ప‌వ‌న్‌తో ఈసారి కోబలి అనే సినిమా చేస్తాన‌ని త్రివిక్ర‌మ్ కొన్ని సంద‌ర్భాల్లో చెప్పారు. దానికి సంబంధించిన స్ర్కిప్టు వర్క్ అప్ప‌ట్లో కొంతవ‌ర‌కూ జ‌రిగి ఆగిపోయింది.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ కోబ‌లి దుమ్ము దులుపుతున్నార్ట‌. ‘మ‌నం క‌ల‌సి సినిమా చేయాల‌నకొంటే.. కోబ‌లినే చేద్దాం. మ‌రో క‌థ ఊసొద్దు’ అని ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌కి స్ట్రాంగ్‌గా చెప్పాడ‌ట‌. దాంతో కోబ‌లి స్ర్కిప్టు తిర‌గ‌రాసే ప‌నిలో ప‌డ్డాడ‌ట త్రివిక్ర‌మ్‌. అ.ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న త్రివిక్ర‌మ్ అతి త్వ‌ర‌లోనే కోబ‌లి స్ర్కిప్టుపై కూర్చుంటార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -