- Advertisement -
మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మంచు విష్ణు ప్రధానపాత్రలో మైథలాజికల్ అంశాలతో తెరకెక్కుతుండగా ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. మోహన్బాబు, మోహన్ లాల్, నయనతార కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుండగా అప్పుడే నెగటివ్ ట్రోలింగ్ మొదలైంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కన్నప్ప సినిమాలో పస లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం మోహన్బాబు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.
కన్నప్పతో ఎలాగైన పెద్ద హిట్ కొట్టి కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నారు విష్ణు. అందుకే భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరాకి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం.