Sunday, May 19, 2024
- Advertisement -

జైలుకు జ‌గ‌న్.. టీడీపీలోకి 16 మంది వైసీపీ నేత‌లు

- Advertisement -
15 Members YSRCP Leaders Join In TDP

ఇప్ప‌టికే ఏపీలో విప‌క్ష వైసీపీ నుండి 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీ లోకి చేరిపోయారు. టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండు ద‌శ‌ల్లో సక్సెస్ అయ్యింది. గ‌తేడాది జ‌న‌వ‌రితో స్టార్ట్ అయిన ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో రెండు ఫేజ్‌ల దెబ్బ‌కు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వ‌చ్చేశారు. వీరిలో న‌లుగురికి బాబు మంత్రి ప‌ద‌వులు కూడా కట్టబెట్టారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో వైసీపీ నేత‌ల గుండెల్లో భయం పుట్టింది. త‌మ నేత జైలుకు వెళితే.. ఏంట‌నే ప్ర‌శ్న‌లు అందరిలో కలుగుతున్నాయి. జ‌గన్ జైలుకు వెళితే త‌మ ఫ్యూచ‌ర్ ఏంట‌ని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నార‌ని ఇంట‌ర్న‌ల్‌గా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మూడో ఫేజ్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొదలు కాబోతుందని తెలుస్తోంది.

ఎన్నిక‌ల‌కు రెండేళ్లే టైం ఉండటం.. నాయ‌కుడు జైలుకు వెళ్ల‌డం వంటి వాటిని పరిశీలిస్తే.. పార్టీలో ఉండాలా? లేక మారాలా? జ‌గన్ త‌ర్వాత పార్టీని స‌మ‌ర్థంగా నడిపించే వారెవ‌రు? అని ఇప్పుడు పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు టీడీపీకి మ‌రింత కలిసి వస్తుందని విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ క్రమంలోనే దాదాపు 10-16 మంది ఎమ్మెల్యేల వ‌ర‌కు టీడీపీలోకి జంప్ చేసే అంశంపై ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నార‌ట‌. టీడీపీలో చేరితే త‌మ‌కు వ‌చ్చే లాభంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు అంశంపై వారు టీడీపీ అధిష్టానంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. సో ఏపీలో మ‌రోసారి మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో వైసీపీకి భారీ షాక్ త‌ప్పేలా లేదు. 

{youtube}FhQsYjNKEYg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -