Thursday, May 16, 2024
- Advertisement -

వీడు మామూలోడు కాదు…

- Advertisement -

మంత్రులు, ఎమ్మెల్యేల లెట‌ర్ ప్యాడ్‌ల‌పై వారి సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేసి త‌మ అవ‌స‌రాల‌కు ఉప‌యేగించె ముదుర్ల‌ను చూస్తుంటాం. కాని ఇలాంటి మ‌హా ముదుర్ల‌ను చూసిండ‌రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు దిమ్మ‌తిరిగిపోయె షాక్ ఇచ్చాడు ఓ మ‌హాఘ‌నుడు. ఈ ఘ‌నుడు చేసిన ప‌నికి అఖిల మైండ్ బ్లాక్ అయ్యింది.

అలీ అనే వ్యక్తికి వారం రోజుల్లోగా తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ మంత్రి అఖిలప్రియ సిఫారసు చేసినట్టు ఓ లేఖ రాసి, ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి..ఆమెకె సిఫారసు లేఖను పంప‌డం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. అలీకి టూరిజం శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అఖిలప్రియ సిఫారసు చేసినట్టు ఉన్న ఈ లేఖను తీసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు వెళ్లగా, అతన్ని మంత్రి వద్దకు పంపించారు.

లెట‌ర్ పై సంతకం చూసి కంగుతిన్న అఖిలప్రియ, ‘ఈ సంతకం ఎవరు చేశారంటూ?’ ప్రశ్నించగా అతను తెల్లముఖం వేసినట్టు సమాచారం. దీంతో, తన పేషీకి అఖిలప్రియ ఈ సమాచారం అందించడంతో ఎస్ఫీఎఫ్ సిబ్బందికి అతన్ని అప్పగించారు. కాగా, మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ ప్యాడ్స్ ను తయారు చేసి వాటిపై ఫోర్జరీ సంతకాలకు అలీ పాల్పడినట్టు తెలుస్తోంది. ఫోర్జరీకి పాల్పడిన వ్యక్తి గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీగా గుర్తించినట్టు మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -