Saturday, May 4, 2024
- Advertisement -

షాకింగ్… హెరిటేజ్ ఫ్రిడ్జ్‌లో వన్యప్రాణుల మాంసం…… యనమల బంధువు క్రైమ్

- Advertisement -

టిడిపి నేతలు మట్టి, ఇసుకతో సహా అన్నింటినీ దోచేస్తున్నారని అన్ని పార్టీల నేతలూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ ఒన్ అవినీతి రాష్ర్టంగా వినుతికెక్కిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ప్రజలు అన్నింటినీ దోచుకుంటున్న టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టిడిపి నేతలు మాత్రం మట్టి, ఇసుకలే కాదు………వన్యప్రాణులనూ వదలడం లేదన్న విషయం తాజాగా బయటపడింది.

టిడిపిలో నంబర్ టూ స్థాయి నేత అయిన యనమల రామకృష్ణుడి సన్నిహిత బంధువు నెట్టి కృష్ణంరాజు సారథ్యంలోనే ఈ వన్యప్రాణుల వేట, మాంసం తరలింపు కార్యక్రమం జరిగింది. అది కూడా పోలీసులు తనిఖీ చేయరు అన్న ఉద్ధేశ్యంతో చంద్రబాబునాయుడి కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫ్రీజర్‌లో వన్యప్రాణుల మాంసాన్ని తరలించారు. అయితే అటవీశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలలో అడ్డంగా దొరికిపోయారు టిడిపి నేతలు. యనమల సన్నిహితుడితో సహా టిడిపి నేతలు చాలా మంది వన్యప్రాణుల వేట, మాంసం తరలింపు కార్యక్రమాల్లో దొరికిపోయిన వార్త దావానలంలా వ్యాపించడంతో వెంటనే ముఖ్యనేత నుంచి మేనేజ్‌మెంట్ వ్యవహారం నడిచిందని తెలుస్తోంది.

మొదట అన్ని వివరాలూ మీడియాకు వెల్లడించిన అటవీశాఖ అధికారులు పట్టుబడిన వాళ్ళు టిడిపి నేతలు అని తెలిశాక…..ముఖ్య నేత స్థాయిలో ఒత్తిడి వచ్చాక ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా హెరిటేజ్ ఫ్రీజర్లో వన్యప్రాణుల మాంసాన్ని తరలిస్తూ దొరికిపోయిన వ్యవహారంతో టిడిపి నేతలు మట్టి, ఇసుకలనే కాదు అన్నింటినీ దోచేస్తున్నారన్న నిజం మరోసారి కళ్ళకు కట్టినట్టైందని జనం మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖ హీరోలు, హీరోయిన్స్ కూడా వన్యప్రాణులను వేటాడిన కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇప్పుడు స్వయానా రాష్ట్ర ఆర్థికమంత్రి సన్నిహిత బంధువులు, టిడిపి నేతలు కూడా కేసులను ఎదుర్కుంటారా? లేక చట్టం మా చుట్టం అని ముఖ్యనేత తరహాలోనే మేనేజ్ చేసి బయటపడతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -