Thursday, May 9, 2024
- Advertisement -

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

- Advertisement -

సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె వైఎస్ జ‌గ‌న్ సుప‌రిపాల‌న దిశ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. టీడీపీ హ‌యాంలో అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేశ‌ర‌నె విమ‌ర్శుల ఎదుర్కొంటున్న అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన జ‌గ‌న్ వారి స్థానంలో స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారుల‌ను నియ‌మించారు.

సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం అయిపోయింది … ఇక ఇప్పుడు ప‌రిపాల‌న మీద దృష్టి సారించాలి. జూన్ 8న కొత్త మంత్రి వ‌ర్గం కొలువు దీర‌నుంద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.కేబినెట్‌లో 15 మందికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న కేబినేట్ పై ఒక అవ‌గాహ‌న ఉన్న జ‌గ‌న్ ఎవ‌రుండాల‌నే దానిపై నిర్ణ‌యం తీసుకున్నారు.

జూన్ 11 తర్వాత మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ పాలనను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం డీజీపీతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వైఎస్ జగన్.. సీఎంవోలోని కీలక అధికారులపై వేటు వేసిన సీఎం, డీజీపీ ఠాకూర్, ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరావును బదిలీ చేశారు. శనివారం లోగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సైతం స్థాన చలనం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -